జూలూరు గౌరిశంకర్ - దీర్ఘ కవితలు విశ్లేషణ

Main Article Content

గిన్నారపు ఆదినారాయణ

Abstract

తెలుగు సాహిత్యంలో వచన కవితా ప్రక్రియలో దీర్ఘకావ్యాలకు విశిష్ట స్థానం ఉంది. తిక్కన కాలం నాటి దీర్ఘ వచనాల నుండి ఆధునిక యుగంలో సామాజిక ప్రయోజనం ఆశించే బలమైన ప్రక్రియగా ఇది పరిణామం చెందింది. జూలూరు గౌరిశంకర్ రాసిన ఎలియస్, పాదముద్ర, నా తెలంగాణ వంటి రచనలు ఈ కోవలో ప్రముఖమైనవి. రైతుల ఆత్మహత్యలు, కరువు కాటకాలు, పాలకుల నిర్లక్ష్యం మరియు బహుజన రాజ్యాధికార ఆకాంక్షలను ఈ దీర్ఘకవితలు ఇతివృత్తంగా చేసుకున్నాయి. సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ, అట్టడుగు వర్గాల వెతలు, దళిత, స్త్రీవాద కోణాలు మరియు తెలంగాణ ఉద్యమ ఆవశ్యకతను ఈ రచనలు శక్తివంతంగా చిత్రించాయి. కవి తన సాహిత్యం ద్వారా పీడిత ప్రజల పక్షాన నిలబడి వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు.

Article Details

Section

Research Articles

Author Biography

గిన్నారపు ఆదినారాయణ

తెలుగు సహాయ అధ్యాపకులు, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యూయేట్ కళాశాల, సికింద్రాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

References

గౌరిశంకర్, జూలూరు, ముండ్లకర్ర, స్పృహ సాహితీ సంస్థ కోదాడ, నల్లగొండ. 2004.

గౌరిశంకర్, జూలూరు, జూలూరు దీర్ఘకవితలు, స్పృహ సాహితీ సంస్థ కోదాడ, నల్లగొండ. 2012

గౌరిశంకర్, జూలూరు, నా తెలంగాణ, స్పృహ సాహితీ సంస్థ కోదాడ, నల్లగొండ. 1997

గౌరిశంకర్, జూలూరు, సెగ, స్పృహ సాహితీ సంస్థ కోదాడ, నల్లగొండ. 2008.